![]() |
![]() |

జీతెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -27 లో...... గంగ పెళ్లికి ఏర్పాట్లు జరుగుతాయి. పెళ్లికొడుకుని పిలవడానికి లక్ష్మీ తన గదివైపు వెళ్తుంది. అక్కడ కొంతమంది రౌడీలు అబ్బాయి గురించి మాట్లాడుకుంటారు. ఇది పెళ్లి కాదు ఒక నాటకం ఇదంతా మా సర్ బిజినెస్.. పెళ్లి చేసుకొని అమ్మాయిని దుబాయ్ కి అమ్మేస్తాడనుకుంటారు. అప్పుడే అబ్బాయి వచ్చి ఎవరైనా వింటారు. సైలెంట్ గా ఉండండి అని రౌడీలతో అతను అంటాడు.
అప్పటికే లక్ష్మీ మొత్తం వినేస్తుంది. నాకు ముందు నుండి డౌట్ గానే ఉందని లక్ష్మీ అనుకుంటుంది. లక్ష్మీ వినేసిందని వాళ్ళకి అర్ధమవుతుంది. వెంటనే లక్ష్మీ కాళ్ళు కట్టేసి ఒక రూమ్ లో బంధిస్తారు. ఆ తర్వాత వీరుకి పెళ్ళికొడుకు ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తాడు. మరొకవైపు గంగ నాకు చాలా దగ్గర అయింది.. తనకి నా తరుపున ఏదైనా ఇవ్వాలని శకుంతల అనుకుంటుంది. తాళిబొట్టు చేతిలో పట్టుకొని గతంలో రుద్రకి కాబోయే భార్యకి ఇవ్వాలని అనుకుంటుంది. గతంలో వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉందని గుర్తుచేసుకుంటుంది.
నిన్ను కన్నకొడుకులాగా చూసుకున్నాను కానీ నువ్వు నా కొడుకు చావుకి కారణం అయ్యావ్.. నిన్ను ప్రేమించిన అమ్మాయిని మోసం చేసావ్.. ఈ తాళి నీకు ఇచ్చే అర్హతని కోల్పోయావ్.. ఇది గంగకి ఇస్తానని శకుంతల అనుకుంటుంది. తాళి, చీర రెడీ చేస్తుంది. మరొకవైపు వీరు, ఇషిక గంగ ఇంటికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |